సోప్ అనే మేధావి చెప్పిన ఓ కల్పిత కథ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఓ అరణ్యంలో సింహం తనకు కన్పించిన ప్రతి జంతువునూ ‘ఈ అడవికి నేను రాజునా? కాదా?’ అని అడిగేది. అన్ని జంతువులూ ‘నీవే రాజువు’ అని సమాధానమిచ్చేవి. ఓ రోజు చిరుతపులిని అడిగినా అది కూడా సంకోచిస్తూ ‘నీవే రాజువు’ అన్నది. చివరకు ఏనుగును అడిగింది. వెంటనే ఏనుగు సింహాన్ని దూరంగా విసిరేసింది. ‘ఓ గజరాజా! నీకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పవచ్చు. నన్ను ఇంతలా గాలిలో ఎగరేయాల్సిన అవసరం లేదు’ అంటూ గట్టిగా అరిచింది.

ఈ కథను ఉదాహరించిన ఓ తత్త్వవేత్త ‘విగ్రహాన్ని ఆరాధించే వ్యక్తి ఆరాధన అంటే ఏంటో నీకు నిజంగా తెలుసా?’ 

అన్నదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు; అతడి జీవితమే దానికి సమాధానం అంటాడు.

అలాగే ఈ దేశంలో సనాతన ధర్మం అవలంబించే వ్యక్తులకు ఇక్కడి భూమిలోని ఎన్నో చోట్ల ఆరాధానా కేంద్రాలు. కాశీ ఉందనుకోండి, అది ఇక్కడి సనాతనులకు భూమి మాత్రమే కాదు, శివుడు నడయాడిన అపర కైలాసం. కాశీలోకి ప్రవేశిస్తే సంపూర్ణమైన నమ్మకంతో, అపార విశ్వాసంతో వీధుల్లో నడుస్తారు. అక్కడే శివుడు, అన్నపూర్ణ, బుద్ధుడు, ఆదిశంకరుడు, జైనతీర్థంకరులు, భక్తకబీర్, తులసీదాస్ అందరూ ఆ క్షేత్రంలో దర్శనం ఇస్తారు. ఇదంతా ఆజ్ఞలతో ఈ ధర్మావలంబులకు ఎవరూ చెప్పలేదు- చెప్పలేరు!? ఇదంతా విశ్వాసాల మేళవింపు!

ఇలాంటి విశ్వాసాలను ఈ దేశంలో ఏ మీడియా పట్టించుకోదు. మన మాధ్యమాలకు ‘నెగెటివ్ అప్రోచ్’ ఎక్కువ. జనాన్ని ఆకర్షించాలంటే వ్యతిరేక దృష్టిని అటువైపు తిప్పాలనే ప్రయత్నం గొప్పగా చేస్తున్న ‘రేటింగ్’ వెర్రెత్తిన ఛానళ్లను చూస్తే నవ్వొస్తుంది. 

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా అరియమంగళం నదీ తీరంలో కాళీమాత మందిరం నిర్మించిన ‘జయ్’ అనే అఘోరా తన తల్లి మరణిస్తే ఆమె శవంపై కూర్చున్న సంఘటన మీడియాను బాగా ఆకర్షించింది. అదే తమిళనాడు పక్కనున్న ట్రావెన్‌కోర్ సంస్థానంలోని ‘పందళం’లో వేలాదిమంది మహిళలతో పెద్ద ర్యాలీ జరిగింది. ‘అయ్యప్ప ధర్మ సంరక్షణ సేన’ పేరిట జరిగిన ఈ ర్యాలీలో ‘శబరిమలను రక్షించండి’ అన్న నినాదాలు మహిళలు మార్మోగించారు. ఈ వారంలో ఈ దేశ నమ్మకాలకు వ్యతిరేకంగా వచ్చిన రెండు సుప్రీం కోర్టు తీర్పుల్లో శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశం కూడా ఒకటి. ఈ తీర్పును నిరసిస్తూ, ఇందుకు వ్యతిరేకంగా పందళం పట్టణం మహిళల నిరసనలతో అట్టుడికింది.

మహిళలకు అనుకూలంగా తీర్పువస్తే- ఆ మహిళలే తీర్పును వ్యతిరేకించడం విడ్డూరం కాదా? జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో హిందూ మతాన్ని దుమ్మెత్తిపోసే మహిళా సంరక్షకులుగా వున్న పురుష రచయితలందరినీ తొలుస్తున్న ప్రశ్న! స్ర్తివాద అస్తిత్వమే ఆరోప్రాణంగా బ్రతికే చలం వారసులకు కూడా ఇది మింగుడుపడని అంశమే. ఇక హిందూమతంలోని ఏ అంశం చర్చకు వచ్చినా- ‘సీతను రాముడు ఎందుకు అడవికి పంపాడు?’ ఆవు వ్యాసం లాంటి డైలాగును పదే పదే చెప్పేవాళ్లకు ‘సేవ్ శబరిమల’ ర్యాలీ అర్థం కాక తలబొప్పి గట్టింది. శబరిమల భక్తులంతా స్ర్తి ద్వేషులన్నట్లు ప్రచారం చేసే కొన్ని ప్రచార మాధ్యమాలకు దీన్ని గురించి ఆలోచించే తీరిక లేదు.

ఈ ర్యాలీలో ‘రాజ్యాంగానికి శతాబ్దాల పూర్వమే సంప్రదాయాలున్నాయ్’ అన్న నినాదం వినిపించింది. అంటే ఇది రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా చిత్రీకరించడం కాదు. సంప్రదాయాల, నమ్మకాల ప్రాచీనత చెప్పడం. అంతెందుకు? ఈ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలోని మగ జడ్జీలంతా మహిళలు శబరిమల గుడిలో ప్రవేశించవచ్చునని తీర్పునిస్తే, అదే ధర్మాసనంలోకి ఏకైక మహిళా జడ్జి జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం ‘ఇది మత విశ్వాసాలకు సంబంధించిన అంశం అనీ, ఇలా తీర్పులు వస్తే ఇది ఇక్కడితో ఆగదు’ అని పేర్కొన్నారు. ఇక్కడ ‘సజాతి ధృవాల వికర్షణ, విజాతి ధృవాల ఆకర్షణ’ అన్న ఫ్రాయిడ్ సిద్ధాంతం పనిచేసిందా? కాదు.. కాదు! అక్కడ ఏం జరుగుతుందో, ఆ నమ్మకం ఎందుకు ఉందో జస్టిస్ ఇందూ మల్హోత్రాకు మాత్రమే తెలుసు. ఆమె ఈ దేశ నారీమణి.

‘బలమైన మత విశ్వాసాలు, ఆచారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోజాలవు. ఇందులో న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలు అసంబద్ధం. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆరాధకులు, మత సంస్థలే’ అని ఇందూ మల్హోత్రా బల్లగుద్ది మరీ చెప్పారు. హిందూ ధర్మానికి సంబంధించి లక్షలాది ఆరాధనా కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడా లేని ఓ వింత నియమం ఇక్కడే ఎందుకు ఉంది? కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో చట్టాల సంరక్షణతోపాటు నైతిక జీవనం కూడా సమాజాన్ని శాంతియుతంగా ఉంచుతుంది. మతవిశ్వాసాలన్నీ అలాంటి నైతిక జీవనం అందించే క్రమంలో బలమైన ఆలోచనలుగా మారుతుంటాయి. మూలతత్వాన్ని గ్రహిస్తే సమాధానం దొరుకుతుంది. అలా కాక చేతులతో నడిచి, వింత మనుషులై త్వరగా పేరు ప్రతిష్ఠలు పొందాలనుకొనే మనకు అది సాధ్యం కాదు!?

అలాంటి స్థితిలో దేశ అత్యున్నత న్యాయస్థానానికి కేరళ మహిళల్లాగే కొంత సమాచారం ఇవ్వాల్సి వుంది. శబరిమలై దేవాలయంలోకి 10-50 సంవత్సరాల వయసున్న మహిళల ప్రవేశానికి సంబంధించి కేసు వేసిన పిటిషన్‌దారు పేరును పత్రికలు పెద్దగా ప్రస్తావించలేదు. సామాజిక మాధ్యమాల సమాచారం మేరకు నౌషాద్ అహ్మద్‌ఖాన్ అనే వ్యక్తి ఇందులో పిటిషన్‌దారుగా తెలుస్తున్నది. ఫ్యూబర్టీ స్టేజ్ నుండి మెనోపాజ్ దశ వరకున్న ఆడవాళ్లకు మాత్రమే ఈ ఆలయ ప్రవేశం నిషిద్ధం. మిగతా వయసులవారికి అది నిషేధం కాదు. కాబట్టి మహిళా వ్యతిరేక చర్యగా ఆ ఆచారాన్ని చెప్పలేం. వయసులో వున్న స్ర్తిలకు సంబంధించిన విధి - నిషేధంలో ఏదో ప్రత్యేకమైన ఆలోచన ఉండితీరాలి. మహిళలే దేవాలయంలోకి రావద్దు అంటే అది అన్ని వయసులకు ఉండాలి కదా?

 అంటే ఇది వయసుకు సంబంధించిన విషయం అన్నమాట. హిందూ దేవాలయాలన్నింట్లోకి స్ర్తిలకు ప్రవేశం ఉంది. మీరాను మించిన కృష్ణ్భక్తురాలు ఇంకెవరు? శారదా మాతను మించిన శ్రీరామకృష్ణుల శిష్యురాలు ఎవరు? ఆఖరికి అస్ఖలిత బ్రహ్మచారి హనుమంతుడికి కూడా పరాశర సంహిత ప్రకారం సువర్చల అనే స్ర్తిమూర్తినిచ్చి కల్యాణం జరిపించే ఉదాత్తత మనది. కాబట్టి ఇది స్ర్తి దేశం ఎంత మాత్రం కాదు. స్ర్తిలపై వివక్ష అంతకన్నా కాదు! అలాగైతే ఈ మహిళా న్యాయమూర్తి ఈ తీర్పును వ్యతిరేకించరు. మలయాళ స్ర్తిలు వేలాదిమంది రోడ్లపైకి రాలేరు కదా?

కేరళలోని అయ్యప్పను గురించిన ఆధారాలు అక్కడ ‘్ధర్మశాస్తా’ అనే రూపంలో చూపిస్తారు. మలయాళంలో పూర్వం నుండి జానపదుల పాటల్లో అయ్యప్ప ఒక యుద్ధవీరుడు. పందళరాజు, పాండ్యరాజు వద్ద జరిగిన విషయాలను ‘అయ్యప్ప సేవం’ పేరుతో ‘ఏడు సేవకాలు’ ఈ పాటలున్నాయి. పాండిచ్చేవం, పులిచ్చేవం, ఇళైయరసు చేవం, వెళిచ్చేవం, ఈళచ్చేవం, పందళచ్చేవం, వేళార్‌చేవం- వీటిని ఢమరుక వాద్యంతో వినిపిస్తారు. ఉదయనన్ అనే దురాత్ముణ్ణి అయ్యప్ప వధించి, అతడు ధ్వంసం చేసిన శబరిగిరి ఆలయాన్ని అయ్యప్ప పునరుద్ధరించి ఆ ఉత్సవంలో అయ్యప్ప పాల్గొన్నట్లు చెప్తారు. 

ఎరుమేలిలో జరిగే ‘పేట్టేతుళ్లాల్’ అనే అంగడి నృత్యం కూడా ఆదివాసీ, గిరిజన సంప్రదాయమే. ఇదంతా స్థానిక ఆచార కథనాలు, నమ్మకాలతో ముడిపడిన భక్తి అని తెలుస్తున్నది. బ్రహ్మచారిగా అయ్యప్ప భక్తి బాగా ప్రచారంలోకి రాగా అతని జీవిత కథలో కూడా స్ర్తిని గొప్పగా గౌరవించే కథనం కన్పిస్తుంది.

ఇలాంటి అయ్యప్పను సేవించే దీక్షాపరులు స్వయం పాకం, నిక్షేరము, శీతల స్నానం, చందన లేపనం, నల్లని వస్తధ్రారణ, పాదరక్షారహితం, భూతల శయనం వంటి కఠిన నియమాలను పాటిస్తూ పూజిస్తారు. అలాంటి సమయంలో స్ర్తి సాంగత్యం పురుషులు వర్జిస్తే, ఋతుకాలం కాని బాలికలు, ఋతుకాలం ముగిసిన స్ర్తిమూర్తులు అయ్యప్పను సేవిస్తారు. ఇదంతా నియమంగా మనకు కన్పిస్తుంది. 

పూర్వం వాళ్లకున్న పరిధిలో కొన్ని విధి నిషేధాలను అక్కడి క్షేత్రపాలకులు పెట్టుకొన్నారు. ఇప్పటికీ హిందూ స్ర్తిలు ఋతుకాలంలో ఏ దేవాలయాన్ని సందర్శించరు. అలాంటి నియమం మిగతా దేవాలయాలకు ఎక్కడా చెప్పుకున్నా వారు పాటిస్తారు.

ఆరోగ్య శాస్త్ర రీత్యా స్ర్తిలకు ఋతుకాలం విశ్రాంతి సమయం. వారి మానసిక ప్రశాంతతకు కూడా అది అవసరం. ఇవన్నీ మన ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పినా మనం ఛాందసం అంటూ కొట్టేస్తాం. శరీరం నుండి ఆత్మకు శక్తి ఎక్కడ ప్రసారం జరుగుతుందో, ఎక్కడ వాతావరణం శక్తితో నింపబడుతుందో, ఎక్కడైతే ఆత్మస్థితి మహోన్నత సమాధివైపు కదులుతుందో అక్కడ క్షేత్రం, తీర్థం సృష్టింపబడింది. స్ర్తిల ఋతుక్రమానికి, చంద్రభ్రమణానికి దగ్గరి సంబంధం ఉంది. స్ర్తి శరీరం ఆరోగ్యంగా, సాధారణంగా ఉంటే 28 రోజుల తర్వాత ఋతుస్రావం జరుగుతుంది. ఆ సర్కిల్‌కు భంగం జరిగిందంటే ఎక్కడో ఏదో క్రమం తప్పిందని అర్థం.

1950లో విశ్వ రసాయనశాస్త్రం (కాస్మిక్ కెమిస్ట్రీ) అనే శాస్త్రం పుట్టుకొచ్చింది. విశ్వమంతా ఒకే శరీరం అన్నది దాని సారాంశం. జార్జి జియార్టీ అనే వ్యక్తి ఈ శాస్త్రాన్ని అనే్వషించిన వాళ్లలో ముఖ్యుడు. ఈ క్రమంలో టమాటో అనే జపాన్ వైద్యుడు స్ర్తి పురుషుల రక్తంపై అనేక పరిశోధనలు చేసి ఋతుస్రావ సమయంలో స్ర్తి రక్తం పలుచగా ఉంటుందని చెప్పాడు. సూర్యుడిపై అణుతుఫాను రేగినపుడు పురుషుల్లో కూడా రక్తం పలుచబడుతుంది. ఎక్కడో వున్న సూర్యుడికి భూమిమీద వున్న పురుషుడికి ఏమిటి సంబంధం? ఇదంతా ప్రకృతికి, మనిషికి మధ్యనున్న సంబంధం. అందువల్లనే విశ్వంలోని ప్రతి అణువుకూ ఒకదానితో ఒకటి సంబందం ఉంటుంది.

ఇదంతా ఆగమశాస్త్రాల కట్టుదిట్టాలు. దీన్ని నమ్మకంగా కూడా అవసరమైతే పరిగణించాలి. ఒక వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారిస్తున్న న్యాయమూర్తులది తప్పేం కాకపోవచ్చు. ఆ వ్యక్తి తనకు న్యాయం జరగడం లేదని కోర్టుకు వెళ్ళాడు కాబట్టి అలా తీర్పు ఇచ్చి ఉండవచ్చు. ఇపుడు వీధుల్లోకి వస్తున్నవాళ్ల నమ్మకాలను కూడా చట్టం పరిగణనలోకి తీసుకోవాలి. 

ఇక్కడ ఎవరు గుడికి ఎలా వెళ్తారన్నది ముఖ్యం కాదు. గుడికి ఇష్టం ఉంటే పోవచ్చు, లేకపోతే బలవంతం లేదు. కానీ నమ్మకాలను గౌరవించాలన్నదే ప్రాథమిక అభ్యర్థన. ‘పురాణమిత్యేవ నసాధుసర్వమ్’- పురాణం చెప్పేదంతా అంగీకరించాలని సనాతన ధర్మం ఎప్పుడూ చెప్పదు. సనాతన ఆచారాలన్నీ చెడ్డవి కావు. కొత్త ఆచారాలన్నీ మంచివి కావు. 

ప్రతివాటిలోనూ మంచీ చెడ్డ రెండూ ఉంటాయి. కానీ ఆ మంచిని గౌరవించే అవకాశం ఇవ్వండి ప్లీజ్... ఎందుకంటే చెడ్డ ఉన్నా లేకున్నా చెడుగా చిత్రీకరించే శక్తులున్నాయి కాబట్టి..!

*********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
📰 ఆంధ్రభూమి : భాస్కర వాణి 📰

కొక్కొరో ... క్కో ... 


***********************************
– డా|| పి.భాస్కర యోగి
 జాగృతి : వారపత్రిక 
01-07: అక్టోబర్  - 2018
సంపుటి : 70, సంచిక : 50




ఓ పాశ్చాత్య స్త్రీ తన భర్తతో “నీ కొడుకు, నా కొడుకు కలిసి మన కొడుకును కొడుతున్నారు” (“Your Children, my children are Quarreling with our children”)   అని ఫిర్యాదు చేసిందట. పాశ్చాత్య దేశాల్లో ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు వివాహాలు, ఉద్యోగాలు, ఇళ్ళు మార్చడం సర్వసాధారణం. దానివల్ల ఆమెకు వేరే పురుషుని వల్ల పుట్టిన కొడుకు, ఇతనికి వేరే స్త్రీ వల్ల పుట్టిన కొడుకు, మళ్ళీ వీళ్ళకు పెళ్ళాయాక పుట్టిన కొడుకు మధ్య జరిగిన కొట్లాటను గురించిన సంఘటన పైన చెప్పబడింది.

పాశ్చాత్య దేశాల్లో కుటుంబాలు, వాటి అనుబంధాలు చాలా విచిత్రమైనవి. పశుపక్ష్యాదుల్లా ‘స్వేచ్ఛా లైంగిక వాంఛలు’ వారి సొంతం. మెల్లమెల్లగా విస్త్రృత మత మార్పిడులు, పాశ్చాత్య భావజాలం నూరిపోసే సంస్థల మూలంగా మనకూ ఆదుస్థితి దాపురిస్తుందనడానికి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఓ నిదర్శనం. 

ఈ విషయంలో మనం కోర్టులను నిందించాల్సిన అవసరం కూడా లేదు. కానీ 135 కోట్ల భారతదేశంలో కొద్దిమంది మాత్రమే ఇలాంటి బాధితులుంటారన్నది సుస్పష్టం. కానీ అలాంటి కొద్దిపాటి సంఘటనలను సరిచేయడానికి కోర్టులు ఇచ్చే తీర్పులు అప్పుడుప్పుడు లాభం కన్నా నష్టమే ఎక్కువ చేస్తాయనడానికి ఇదొక నిదర్శనం.

“వివాహేతర బంధం విషయంలో మహిళ, పురుషుడూ ఇద్దరూ పాల్గొన్నపుడు పురుషుడు మాత్రమే నేరం చేసినట్లు పరిగణించడం సరికాదు” అనే పట్‌వర్ వాదనకు సుప్రీంకోర్టు ధర్మాసనం” అసలు.. 497 ఐపీసీ చెల్లదు. ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడం నేరమే కాదు. అంటే... ఇందులో మహిళదీ, పురుషుడిదీ తప్పుకాదు. పరస్పరం ఇష్టపడినపుడు శృంగారంలో పాల్గొనడం నేరం కాదు” అని తీర్పును ఇచ్చింది. 158 సంవత్సరాల ఐపీసీ సెక్షన్ 497 భార్యల లైంగిక ప్రాధాన్యతను తగ్గిస్తుందని కూడా న్యాయమూర్తులు పేర్కొన్నారు.

దేశం మొత్తం మీద దీనికి హర్షం ప్రకటించిన వాళ్ళలో కమ్యూనిష్టు పార్టీ నాయకురాలు బృందాకారత్, సామాజిక ఉద్యమకారిణి రంజన కుమారి, అర్ధరాత్రి కోర్టులు తెరిపించి సరిక్రొత్త దేశభక్తులకు సహాయపడే న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వంటి వాళ్ళు ఉన్నారు. ఈ దేశంలో చిటుక్కుమన్నా స్పందించే ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ ఇది ‘అభ్యుదయమైన తీర్పు’ అని పేర్కొన్నది. 

వెంటనే అసదోద్దీన్ ఓవైసీ “గేసెక్స్ నేరం కాదు... వివాహేతర సంబంధం నేరం కానపుడు త్రిపుల్ తలాక్ నేరం ఎలా అవుతుంది అన్నారు” విచిత్రంగా ఈ కేసులో ప్రధాన పిటిషనర్ జోషెఫ్ షైన్ అనే వ్యక్తి అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

ఈ దేశంలో ఫ్రాయిడ్ వారసులకేం కొదవలేదు. “లార్డ్ బైరన్ అనే ప్రసిద్ధ పాశ్చాత్యుడు పెళ్ళయ్యేనాటికే 60 మంది స్త్రీలతో సంబంధాలు నెరపి పెళ్ళిరోజు చర్చి మెట్లు దిగుతున్నపుడు తారసపడ్డ అమ్మాయి గురించి కారు ఎక్కక ముందే” ఆ అమ్మాయి నాకు నచ్చింది అని చెప్పాడట. కామించి, ప్రేమించు అనే పాశ్చాత్య భోగవాదం ఈ దేశంలోకి తీసుకురావడానికి వ్యాపార దృష్టి ఓ కారణం. 

అందుకే ప్రేమికుల రోజు పబ్బులు, క్లబ్బులు, గబ్బులు, నిండిపోవడం వెనుక ఉన్న అసలు మతలబు అదే. దాని దుష్పరిణామాలే ఇటీవల మన దేశంలో పంజాబ్ ‘ ఉడ్తా పంజాబ్’ గా మారడం, హైదరాబాద్‌లో కాఫీ షాప్‌ల పేరిట హుక్కా సెంటర్లు, స్కూళ్ళు, కళాశాలల్లో డ్రగ్స్ వ్యాపారం విచ్చలవిడిగా సాగడం వెనకున్న రహస్యం ఇదే.

మన దేశంలో వివాహవ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఈ రోజుకూ చాలా పటిష్టంగా ఉంది. నవీన నాగరికత ఎంత ముదిరినా దాని మూలం చెదిరిపోకుండా అది రూపాంతరం చెందుతున్నది కానీ ధ్వంసం కావడం లేదు. కామం తీవ్రత తెలిసిన మన పెద్దలు విధి  నిషేధాలను చాలా జాగ్రత్తగా చేసారు. ఎక్కడ  నిషేధం ఉంటుందో అక్కడ అది స్వాగతమే. ఆడమ్  ఈవ్ విషయంలో అదే జరిగింది కదా!

అందుకే మన వాళ్ళు కథల రూపంలో శృంగారాన్ని అందించారు. వాత్సాయన ఋషి కామ సూత్రాలను ప్రపంచం కళ్ళు తెరవని నాడే అందించాడు. కామాన్ని అర్థం చేసుకోవడానికే బ్రహ్మచర్యం, గార్హస్థ్య జీవనాలను పొందుపరిచారు. దాని తీవ్రతను నిషేధం చేయకుండా వివాహ వ్యవస్థ ద్వారా స్థిరత్వం కల్పించారు. ఒక్క క్షణం కలిగే సంభోగ పరాకాష్టను విస్మరించడం, అణగదొక్కడం కాకుండా ఉదాత్తస్థితిలో దానిని అనుభవించే అవకాశం వివాహం ద్వారా కల్పించారు. కామభావాన్ని రామభావంగా తీర్చిదిద్దారు. 

మన నాగరికతా బీజాలను వేలయేళ్ళ నుండి సంరక్షిస్తూ చిన్న మొక్క నుండి ఫలపుష్పాదులతో నిండియున్న వటవృక్షంగా మార్చారు. దీని వేర్లను పీకే ప్రయత్నం బ్రిటీషు కాలం నుండే జరుగుతోంది. మొఘల్‌పాలనలో దీన్ని కదిలించడం వాళ్ళచేతగాక విత్తనాలనే తమ ఇళ్ళల్లో నాటుకున్నారు. 

కామప్రవృత్తి నుండి మనిషిని జంతువుగా మార్చకుండా ఉంచే కుటుంబ వ్యవస్థ కాపాడింది. అయితే వ్యక్తుల దుష్పరివర్తన, వ్యక్తిత్వహననం, వికృతమనస్తత్వం, పరిస్థితుల వల్ల అది కొంత అక్కడక్కడ అనారోగ్యకరంగా తయారయ్యింది.
శరీరం జడం అయినా అది మనస్సు చెప్పినట్లు వింటుంది. ఫ్రాయిడ్ నుండి యంగ్ వరకు అందరూ శరీరంలో జరిగే మార్పులను మనస్సుకు ఆపాదించారు. 

పాశ్చాత్యుల కామస్థితి చంచలంగా ఉన్నందువల్ల అక్కడ వివాహాలు భగ్నమై, సంసారాలు కుప్పకూలి విడాకులవైపు పరుగెడుతున్నాయి. దాంతో అక్కడి సాంఘీక వ్యవస్థ అతుకుల బొంతగా మారింది. మనస్సుల కలయికతో మాత్రమే జరిగే సంసారాలు మనసులు మారినపుడు క్రిందా మీదా అయిపోతాయి. ఈ అంటురోగం మన సమాజంలోకి వ్యాప్తి చెంది ఫ్యామిలీకోర్టుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే మన సమాజంలో మనస్సు స్థాయిలో ఉండే కామవాంఛకోసమే విడాకులు జరగడం లేదు. ఆర్థిక విషయాలు, స్థాయీభేదాలు, అపరిపక్వ మనస్తత్వాలు, అవగాహనరాహిత్యం, మాట పట్టింపులు... ఇలా ఎన్నో విషయాలు ఈ కుటుంబ వ్యవస్థ విధ్వంసానికి దోహదం చేస్తున్నాయి. 

“ఉన్న నాలుకకు మందువేస్తే కొండనాలుక ఊడిపోయిందన్నట్లు” కోర్టులు దూరదృష్టితో, విస్త్రృత సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పకుండా చేసే వ్యాఖ్యలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా ఉంది. స్త్రీ స్వేచ్ఛ, లైంగిక సమానత్వం పేరిట స్త్రీ హక్కులను రక్షించడానికి చేసే చర్య పురుషులకు విశృంఖలత్వాన్ని ప్రదర్శించేందుకు దోహదం చేయకూడదు. వ్యభిచారాన్ని పరోక్షంగా చట్టబద్దం చేసే విధంగా వ్యాఖ్యానం జరుగుతున్నది.

 ఇటీవల ‘స్వలింగ సంపర్కం’ తప్పుకాదు అని కూడా కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే పాశ్చాత్యుల నుండి దిగుమతి అయిన అపరక్యాన్సర్ ఎయిడ్స్‌తో మన దేశం కూడా బాధపడుతోంది. కొత్త కొత్త లైసెన్స్‌లు ఇవ్వడం ద్వారా ప్రకృతి విరుద్ధమైన చర్యలకు ఆమోదముద్ర వేసినట్లు అవుతుంది. ఇది పత్రికలకు, టీవీలకు మంచిమసాలా కావచ్చుగాక. సమాజ ప్రవర్తనా నియమాల దృష్ట్యా అనారోగ్యకర చర్యలకు మాత్రం ఆస్కారం కల్పిస్తుంది. పాశ్చాత్యుల జైళ్ళలో ఏళ్ళ తరబడి నిర్దాక్షిణ్యంగా బంధించడం వల్ల ఏర్పడ్డ ‘అసహజ చర్యలు’ మెల్లమెల్లగా ప్రపంచాన్ని తాకుతున్నాయి. దాని పర్యవసానమే స్వలింగ సంపర్కుల వివాదం.

 వయోభేదంతో సంబంధం లేకుండా శబరికొండ మీద ఉన్న అయ్యప్ప దేవాలయంలోకి మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు మరో తీర్పు ఇచ్చింది. తెలుగు దినపత్రికలన్నీ ఈ కేసులు వేసిన పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాయి. ఇందులో కూడా ఏం మతలబు ఉందో తెలియదు. సోషల్ మీడియా సమాచారం ప్రకారం ఈ కేసులో పోరాటం చేసింది నౌషాద్ అహ్మద్‌ఖాన్ అని తెలుస్తుంది.

 అంటే హైందవ దేవాలయాల ఆగమ శాస్త్రాలను సవాల్ చేస్తున్నది ఎవరు?! అయితే ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో ఏకైక మహిళా జడ్జి జస్టిస్ ఇందూమల్హోత్రా దీనిని వ్యతిరేకించింది. మతపరమైన విశ్వాసాలు కోర్టులు తేల్చలేవని ఆమె తేల్చి చెప్పింది.

నిజానికి ఈనాటి సైన్స్ పరిభాషలో చెప్పాలంటే ప్యూబర్టీ స్టేజి నుంచి మెనోపాజ్ దశ వరకున్న స్త్రీలకు మాత్రమే ఈ ఆలయ ప్రవేశం నిషిద్ధం. హిందూ స్త్రీలు బహిష్టు సమయంలో ఏ దేవాలయానికి వెళ్ళరు. ఇది కోర్టుల ఆదేశాలకన్నా మహిళలు నైతికంగా స్వీయ నియంత్రణగా పెట్టుకున్నారు. 

51 శక్తిపీఠాల్లో కామాఖ్య దేవాలయంలో స్త్రీలే పూజలు చేస్తారు. తంత్ర విధానంలో స్త్రీకి చాలా ప్రాధాన్యత ఉంది. అయ్యప్పదీక్షలో చన్నీటి స్నానం, భూతలశయనం, పాదరక్షలు లేకుండా పాదచారులై నడవడం, ఏకభుక్తం, బ్రహ్మచర్యం,  మధుమాంస నిషేధం వంటి కఠిన నియమాలున్నాయి. స్త్రీ, పురుషులు కలిసి ఆలయంలోకి వెళ్ళడం వల్ల మనోచాంచల్యం కలుగరాదని మాత్రమే పెట్టిన నియమం కాదిది.

అక్కడి స్థలపురాణంలో కొన్ని కథలు ఈ నిషేధం విధించాయి. మహిళలపైనే వ్యతిరేకతతో నిషేధం ఉంటే కొన్ని వయసులవారికి ఎందుకు ప్రవేశం ఉంటుంది? కావున ఇది మహిళా వ్యతిరేక దృష్టి కానేకాదు. దీనిని హిందూ వ్యతిరేక దృష్టికలవాళ్ళు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. మన శాస్త్రాల్లో చెప్పిన విషయాలు మనం విశ్వసించంగాని పాశ్చాత్యులు చెప్తే తలకెత్తుకుంటాం. టమాటో అనే జపాన్ శాస్త్రవేత్త 20 ఏళ్ళు స్త్రీ, పురుషుల రక్తంపై పరిశోధన జరిపి పురుషుల రక్తంలో లేని ఒక ప్రత్యేక గుణం స్త్రీ రక్తంలో ఉంటుంది, ఋతుస్రావ సమయంలో స్త్రీ రక్తం పలుచన అవుతుంది.

స్త్రీలలో జరిగే మార్పుల వల్ల వారు విపరీతమైన ఒత్తిడికి గురవుతారని వారికి విశ్రాంతి అవసరం అన్నారు. అందుకే స్త్రీలు బహిష్టు ఉన్న సమయంలో వారి మానసిక ఒత్తిడి తగ్గించేందుకు వారికి ఇంటి పనులు కూడా నిషేధంగా పెట్టారు. ఇదంతా ఒక పెద్ద చర్చ. అయితే కోర్టులు ఇలాంటి తీర్పులు ఇచ్చినపుడు కొందరు కోర్టులకు వెళ్ళిన వ్యక్తులకు న్యాయం చేయాలనే స్ఫూర్తితో చేస్తారు. కానీ దాని ప్రభావం సమాజంపై ఎలా అన్నది కూడా ఆలోచించకపోతే ‘కోర్టు తీర్పులు కోటి ప్రశ్నలు’ తలెత్తి అనంతకోటి సమస్యలుగా మారే అవకాశం ఉంది.

********************************
*✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*వర్తమాన భారతం : విజయక్రాంతి*