ఎంతమంది స్వాతంత్య్రవీరులు తమ ప్రాణాలను బలిపెట్టి ఈ దేశానికి విముక్తి కల్పించారో, వాళ్లంతా ఈ రోజు ఇలాంటి వారికోసమా ‘మేం పోరాటం’ చేసిందని వీరస్వర్గంలో తప్పక బాధపడుతుంటారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ మెజారిటీ ప్రజలు ‘తమను సమానంగా చూడమని’ అర్థించడం చూడడం సాధ్యం కాదు. ఇపుడు ముస్లింలీగ్ మళ్లీ పురుడు పోసుకుందా అన్నట్లుగా దేశంలో ఆందోళనలు మొదలుపెట్టారు. సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్, మహమ్మదాలీ జిన్నా ఏక కాలంలో జన్మించి దేశంలో మత రాజకీయం మొదలుపెట్టినట్లు తోస్తున్నది. జోసెఫ్ స్టాలిన్, మావోసేటుంగ్ అర్బన్ నక్సల్స్‌గా అవతారం ఎత్తి దేశంలో లేని అస్థిరతను సృష్టిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.


గత ఏడాది శబరిమల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేరళలో ఇతర ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. ఒక్క రాయి పోలీసులపై పడలేదు. ఇపుడు ‘రాళ్లవర్షం’ ఎవరు సైతానులనుకొని కురిపిస్తున్నారు? అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో పోయిన ఏడాది క్రింద మహమ్మదాలీ జిన్నా ఫొటో పెట్టి ‘ఖాయిదే ఆజం’ అంటూ రెచ్చిపోయిన మూకలు ఇపుడు మాకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ వాళ్లు తమకు దగ్గరి బంధువులంటూ బజార్లోకి వస్తున్నారు. ప్రార్థనకు - రాజకీయానికి అంతరం పాటించాలని ఆలోచించకుండా ‘్ఢల్లీ జమా మసీదు’ నుండి ప్రార్థనల తర్వాత ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. 

జామియా మిలియా విశ్వవిద్యాలయం ఈ బిల్లుపై గెంతులు వేస్తే జెఎన్‌యు విద్యార్థులు అందరినీ రెచ్చగొడుతున్నారు. అర్బన్ నక్సల్స్, ఆశ్రీత కవులు ఎర్ర కలాలతో విషం కక్కుతున్నారు. అగ్నికి ఆజ్యంలా ‘మహమూద్ పరాచా’ లాంటి వామపక్షవాది డా॥ బాబా సాహెబ్ దృక్కోణం చూపిస్తూ వారిని మరింతగా రెచ్చగొడుతున్నాడు. ఎప్పుడూలేనిది ఈ ఆందోళనకారులు భారత జెండాలను పట్టుకొంటున్నారు; రాజ్యాంగాన్ని తలపై మోస్తున్నారు. 

అది సంతోషపడాల్సిన విషయమే!? కానీ అదే బాబా సాహెబ్ దేశ విభజన నాడు చెప్పిన విషయాలే ఈ రోజు అమలు అవుతుంటే ఈరోజు ఆందోళన ఎందుకు? ‘ఈ దేశపు మొదటి కబళం (ముద్ద) ముస్లిం మైనారిటీలకే చెందుతుంది’ అని నాటి ప్రధాని హోదాలో డా॥ మన్మోహన్ సింగ్ ప్రకటించినపుడు ఈ దేశంలో ఏ హిందువూ బాధపడలేదే? ఎందుకంటే ఈ దేశంలో హిందువుల్లో నిజమైన ‘సెక్యులరిజం’ ఉంది. క్యాబ్ బిల్లు వచ్చాక కొన్ని సూడో సెక్యులర్ పార్టీలు, అర్బన్ నక్సల్స్, వామపక్ష మీడియా ఒక మత వర్గాన్ని రెచ్చగొట్టి రోడ్లపైకి తెచ్చి, ఆందోళన చేయిస్తున్నారు కదా! 

ఒకవేళ హిందువులు కూడా అదేవిధంగా రోడ్లపైకి వస్తే, దేశంలో జరిగే పరిణామాలు మనం భరించగలమా? బెంగాల్, కేరళ, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన హింసకు బాధ్యులెవరు? క్యాబ్ చట్టానికి అనుకూలంగా జరిగే ప్రదర్శనలను తొక్కిపెడుతున్న మీడియా ఆందోళనలను మాత్రం భుజంపై ఎత్తుకుంటున్నది. యూపీలో మాత్రమే ఎందుకు తీవ్ర ఘర్షణ పరిస్థితులు సృష్టిస్తున్నారు? ఎందుకంటే హిందూ జాతీయాభిమానం గల యోగి ఆదిత్యనాథ్ అక్కడ పాలించడం సెక్యులర్ ముద్ర వేసుకొన్న వాళ్లకు ఇష్టం లేదు. కాబట్టి అక్కడ ఆందోళన ప్రత్యేకంగా చేస్తున్నారు. 

అంటే ఈ దేశంలో హిందుత్వ మూలాలున్న వ్యక్తి పరిపాలించడం నేరమా? తీవ్రవాదులకు పరోక్షంగా సహకరించే ఫరూఖ్ అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలు గొప్ప సెక్యులర్ సిద్ధాంతంగా ప్రచారం చేసే వాళ్లు హిందూ జాతీయవాదంపై ఎందుకు అంత అక్కసు ప్రదర్శిస్తున్నారు?! బాట్లాహౌజ్ ఎన్‌కౌంటర్ అయ్యాక నాటి సోనియా గాంధీ రాత్రంతా వెక్కి వెక్కి ఏడ్చిందని సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించారు. రాజేంద్ర సచార్ రాత్రంతా వెక్కి వెక్కి ఏడ్చిందని సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించారు.
రాజేంద్ర సచార్ కమిటీ పేరుతో ‘మత హింస బిల్లు’ హిందువులపై రుద్దేందుకు ప్రయత్నించింది నిజం కాదా? ఈ దేశంలో మైనారిటీలంటే కేవలం ఒక మతం వాళ్లేనా? ఫార్సీలు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు మైనారిటీలు కారా? మన ప్రక్కనున్న మూడు ముస్లిం దేశాలు ‘దార్ - ఉల్ - ఇస్లాం’గా ప్రకటించుకొన్నాక ఇంకెక్కడ అక్కడ సెక్యులరిజం ఉంది. మరి అక్కడున్న ముస్లిమేతరులు ఎంత ఘోరంగా అత్యాచారం చేయబడ్డారో సూడో సెక్యులర్ గ్యాంగ్ చెప్పగలదా? అలాగే పాకిస్తాన్‌లో షియాలు, అహ్మదీయులు అత్యాచారాలకు గురయ్యారు కదా! అని వాదిస్తున్నారు. 

నిజానికి షియాలు ఒకవేళ అత్యాచారానికి, ఇబ్బందులకు గురైతే మరో ముస్లిం దేశమైన, ‘ఇరాన్’కు వెళ్లవచ్చు. అలాగే అహ్మదీయులపై వివక్ష చూపెడితే మరో ప్రక్కనున్న ‘బహ్రెయిన్’ వెళ్లొచ్చు. అదంతా అహ్మదీయులకు నెలవైన స్థలమే కదా? ఈ మూడు దేశాలలో ఒక్క హిందువైనా ఉన్నత పదవులు అధిరోహించాడా? అంతెందుకు, మన దేశంలో ముస్లిం మెజారిటీగా మొన్నటివరకున్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో హిందువు ఒక్క ముఖ్యమంత్రి కాగలిగడా? సెక్యులరిజం పేరుతో గొంతు చించుతున్న ఓవైసీ పార్టీలో ఎంతమంది హిందువులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు? ముస్లింలీగ్ పార్టీగానీ, ఎఐఎంఐఎంగానీ ఏనాడైనా హిందువుల గురించి నోరు తెరిచి మాట్లాడారా? 

వాళ్లకు తోడు ఈ దేశంలో హిందూ వ్యతిరేకత నరనరాన జీర్ణించుకొన్న కమ్యూనిస్టులు హిందువులకు వచ్చే ఒక్క ఇబ్బందినైనా ప్రతినిధులుగా ఉండి ఆందోళన చేసారా? సీతారాం ఏచూరి మొదలుకొని బి.వి. రాఘవులు వరకు ప్రతిరోజూ హిందూ మతతత్వంపై యుద్ధం చేస్తాం అంటారు. నిజానికి సెక్యులరిజం అంటే అన్ని మతతత్వాలపై యుద్ధం చేయాలి కానీ కేవలం ఒకరిపైనే ఎందుకు చేస్తారు?! ఈ దేశంలో దేశ విభజన మొదలుకొని క్యాబ్ చట్టం వరకు కమ్యూనిస్టులు ఎప్పుడూ ఈ దేశ వ్యతిరేకతనే ప్రదర్శించారు. పెరియార్, కరుణానిధి తర్వాత ఈ దేశంలో రాష్ట్రానికో కులం, కుటుంబం పాలించడం మొదలుపెట్టారు. వాళ్లకు అధికారం తప్ప ఇంకొకటి పట్టదు. తమ అధికారం కోసం రాష్ట్రానికి ఒక పిల్ల కాంగ్రెస్ ఉద్భవించింది. 

కాంగ్రెస్ ఎలా అయితే కేంద్రంలో కుటుంబ రాజకీయం చేసిందో అలాగే, సంతుష్టీకరణతో తమ అధికారాన్ని నిలబెట్టుకొన్నదో అదేవిధంగా ప్రాంతీయ పార్టీలన్నీ ‘ముస్లిం సంతుష్టీకరణ’ అవలంభించాయి. సావర్కర్ లాంటి దేశభక్తుల నీడలో పుట్టిపెరిగిన బాలా సాహెబ్ థ్రాకే స్థాపించిన శివసేన కూడా ఆయన ఆశయాలకు విరుద్ధంగా అధికారం కోసం ఇటీవల అదే మార్గంలోకి వెళ్లడం హిందువులకు ఆందోళన కలిగించే విషయం. మూడు ముస్లిం దేశాల్లో అత్యాచారాలకు గురైన అక్కడి మైనారిటీలకు గత యూపిఏ ప్రభుత్వం చేసిన లిస్ట్‌కే ఈ బిల్లు మద్దతు పలుకుతుంది.

 ఈ దేశంలోని ఒక్క ‘ముస్లిం మైనార్టీ’కి కూడా దీనివల్ల నష్టం లేకున్నా ఈ అక్కసంతా ఎందుకు?! త్రిపుల్ తలాక్‌పై చట్టం తెచ్చినందుకా? కాశ్మీర్‌లో స్వయం ప్రతిపత్తి రద్దుచేసినందుకా? రామమందిరం తీర్పు హిందువులకు సానుకూలమైనందుకా? బహుశా ఇవే మూలకారణం. మెజారిటీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ ఆందోళన ఇంకెంతకాలం?

*********************************
* శ్రీకౌస్తుభ*
*పెన్ గన్ గ : ఆంధ్రభూమి*
*27-12-2019 : శుక్రవారం*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి