మధ్యప్రదేశ్‌లోని నీమడ్ ప్రాంతంలో పోరాట యోధుడిగా గుర్తింపు పొందిన ‘తాంతియా భీల్’ అంటే ఆంగ్లేయులకు వెన్నులో వణుకు పుట్టేది. అలాంటి వీరుడిని నేరుగా జయించడం చేతగాని ఆంగ్లేయులు కుట్రతో మట్టుబెట్టాలని ప్రయత్నించి, అతని ఆనుపానులు తెలుసుకున్నారు. తాంతియా భీల్ ఓ స్ర్తిని తన సోదరిగా భావించేవాడు. బ్రిటీషర్లు ఆమె భర్తను లొంగదీసుకొన్నారు. 

రాఖీ పూర్ణిమ రోజు తాంతియా రాఖీ కట్టించుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. బ్రిటీషువారు ఆమె భర్త గణపత్ ద్వారా మత్తు మందు కలిపిన పాయసాన్ని తాంతియా చేత తాగించారు. అతను స్పృహ తప్పగానే బయట వేచి వున్న ఆంగ్లేయ సైనికులు అతడిని బంధించి జబల్‌పూర్ దగ్గర 1889లో ఉరితీశారు. ఈ చారిత్రక ఘట్టాన్ని కీ.శే. అనిల్ మాధవ్ దవే తన ‘శివాజీ’ పుస్తకంలో వివరించి, ‘బయటి శత్రువుల కన్నా లోపలి విద్రోహుల వల్లే ఎక్కువ నష్టం కలిగింది..’ అంటూ వ్యాఖ్యానిస్తాడు.


నిజమే..! ఇపుడు దేశంలోని అంతర్గత శత్రువులంతా లేచి కూర్చున్నారు. ముఖ్యంగా సీఏఏ (పౌరసత్వ సవరణ) చట్టం ద్వారా పుడుతున్న అపోహలు దేశాన్ని మతపరంగా విభజిస్తున్నాయి. శుక్రవారం వచ్చిందంటే చాలు దేశంలోని మెజారిటీ ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికంతా కారణం హిందువుల అవగాహనా రాహిత్యం. ‘మోదీ, అమిత్ షా ఉన్నారు గదా! మనం ఏం చేయకున్నా ఫరవాలేదనే’ మనస్తత్వం ఆవహించింది. ఇపుడు దేశవ్యాప్తంగా సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ప్రదర్శనలతో హిందువులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో ‘పంక్చర్ షాప్’ నడిపే సగటు ముస్లిం మతస్థుడు సులభంగా గ్రహిస్తున్నాడు.

 కానీ తన పక్కన ఏం జరుగుతోందో ఈ దేశంలోని ‘మెజారిటీ మతస్థులు’ తెలుసుకోలేకపోతున్నారు. క్రీ.శ.712లో భారతదేశంలోకి చొరబడిన మహమ్మద్ బిన్ కాశీంకు ఎంత క్లారిటీ ఉందో 1946లో దేశ విభజనకు కారణమైన మహ్మద్ అలీ జిన్నాకు అంతే సులభంగా పరిస్థితులు అర్థం అవుతున్నాయి. ఇపుడు సీఏఏను వ్యతిరేస్తున్న ‘సూడో సెక్యులర్ గ్యాంగం’తా అంతే క్లారిటీగా ఉంది. 

ఏ క్లారిటీ లేని కళ్లు మూసుకొన్న కబోదులు హిందువులు. ఎంతసేపూ మన ఇళ్లలో సాఫ్ట్‌వేర్ సీఈఓలను తయారుచేసి, అమెరికాకు పంపి అక్కడి నుంచి వచ్చే డాలర్లతో ఇక్కడ ‘రెరా’ పరిధిలోకి వచ్చే విల్లాలు కొందామనో, హైదరాబాద్ పక్కనో, విశాఖపట్నం చెంతనో భూములు కొని ఫామ్‌హౌజ్‌లు చేద్దామనే ఆలోచన తప్ప ఇంకేం లేదు. బీదత్వంలో ఉన్న హిందువులే ఇంతో అంతో ప్రతిఘటిస్తున్నారు. మధ్యతరగతి హిందువులకు ఈమధ్యకాలంలో ఈ ఉన్నతశ్రేణి హిందువులు ఆదర్శంగా మా రి వారి బాటలో వెళ్లాలన్నట్లు దారులు పరుస్తున్నారు. కోటీశ్వరులు చాలామంది పత్రికలు చదవరు! 

కొందరు హిందూ ధనవంతులు మాత్రం పుట్టినరోజు వేడుకలకు, ఇతర ఉత్సవాలకు స్వల్ప దానధర్మాలు చేస్తున్నారు. కానీ ఇతర మతాలవారు తమ సంపాదనలో కొంతభాగం మతపరమైన విషయాలకు అందిస్తున్నారు. హిందువుల్లో అలా చేసేవారు చాలా స్వల్పం. ఇటీవల సిబిఆర్ ప్రసాద్ అనే ధనవంతుడు చాలా పెద్ద మొత్తాన్ని హిందూ సంస్కార కేంద్రమైన శిశుమందర్‌కి దానం ఇవ్వడం ముదావహం. అలాంటివాళ్లు చాలా అరుదు.
హిందూ సమాజానికి ఈ స్పృహ లేదు. దానధర్మాలు చేయకున్నా ఫర్వాలేదు.. కనీసం తన కాళ్ల కింద భూమి ఎందుకు కదులుతోందా? అని ఆలోచించుకోలేకపోతే ఎలా? ఇటీవల బ్రిటన్‌లో ఎన్నికలు జరిగాయి. అక్కడ నివసించే పాకిస్తాన్ ముస్లింలు, భారత ముస్లింలు ఒకే మాటపై ఉండి లేబర్ పార్టీవైపు నిలబడ్డారు. లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దుచేసిన- ‘370 ఆర్టికల్ నిస్తేజానికి వ్యతిరేకంగా’ తీర్మానం చేయాలని లేబర్ పార్టీతో హామీ తీసుకున్నారు. 

అదృష్టం కొద్దీ అక్కడ కన్జర్వేటివ్ పార్టీ గెలవడంతో వాళ్ల ఆశలు అడియాసలయ్యాయి. ఈ పార్టీ అభ్యర్థి దేవాలయంలో పూజ చేసి ప్రచారం మొదలుపెట్టడం గమనించదగిన విషయం. పాకిస్తాన్ ముస్లింలు కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని సమర్థిస్తే ఫర్వాలేదు కానీ భారత ముస్లింలు ఎందుకు సమర్థిస్తున్నారో తెలిస్తే, ఇపుడు సీఏఏ చట్టాన్ని ఇక్కడి వాళ్లు ఎందుకు వ్యితిరేకిస్తున్నారో అర్థం అవుతుంది. నిజానికి ఈ చట్టం వల్ల ఇక్కడి ముస్లింలకూ ఏ ప్రమాదం లేకున్నా, దీనిపై అపోహలు కలిగించే మేధో వర్గం, మీడియా, సూడో సెక్యులర్ రాజకీయ వ్యవస్థ చాలా చైతన్యవంతగా పనిచేస్తుంది. 

ఉల్లిగడ్డ, టమాటాల ధర తగ్గించాలని దేశవ్యాప్త ఆందోళన చేసే ‘ఎర్ర గ్యాంగు’ దీని వెంబడి ఉంది. వాళ్లకు ఉల్లిధరకూ, తల్లి భారతికి తేడా తెలియదు. వాళ్ల దృష్టిలో దేశంలోకి అక్రమ చొరబాటుదారులు ప్రవేశించడం కన్నా ఉల్లిధర పెరగడమే పెద్ద సమస్య.

డెబ్భై ఏళ్లనుండి దేశ ప్రజలను మభ్యపెట్టి, హిందువులను అణచిపెట్టి ఉంచిన సంతుష్టీకరణ 2014లో ఓ జాతీయవాద ప్రభుత్వాన్ని గెలిపించాయి. ఇదేదో తమ అప్రమత్తత తక్కువై మోదీ గెలిచాడని ఈ శక్తులన్నీ భావించాయి. కానీ 2019లో జాతీయవాద ప్రభుత్వం మళ్లీ గెలవడం, కశ్మీర్ సమస్య, రామమందిరం సమస్య, త్రిపుల్ తలాక్ సమస్యలకు పరిష్కారం అత్యంత సులభంగా నీళ్లు తాగినట్లు చేసే సరికి ఈ శక్తులకు నిద్రపట్టడం లేదు. అంత పెద్ద రామమందిరం ఉద్యమం చేసి ఎంతోమంది హిందువులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. 

కానీ ఎవ్వరిపైనా ఏ ఒక్కడూ ఒక్క రాయి విసరలేదు. మరి ఈరోజు రాళ్లెందుకు విసురుతున్నారు? ‘ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు’ అన్న నినాదాన్ని గోడలపై రాస్తే తూచ తప్పకుండా పాటించిన హిందువులు ఈ రోజు ఈ దేశంలో ‘మాకు హక్కులు కావాలని’ దేబిరించే పరిస్థితికి దిగజారారు.

‘జై భీం జై మీమ్’ అని నినదించే శక్తులు ఈ దేశంపై విషం చిమ్ముతున్నాయి. షెల్హా రశీద్ లాంటి వ్యక్తులు ‘ముస్లింల కోసం దళితులు తమ రిజర్వేషన్లలో కొంత భాగం ఇవ్వాలని’ అప్పుడే డిమాండ్ పెట్టారు. చంద్రశేఖర్ రావణ్ లాంటి కులతత్వవాది జామా మసీదులో ఎలా దాక్కున్నాడో ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు. డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ బొమ్మలతో, ప్లకార్డులతో ప్రదర్శనలు జరుపుతున్నవారు ఆయన రచించిన రాజ్యాంగంపై గౌరవం కలిగి ఉన్నారా? పార్లమెంటు ఏదైనా చట్టం చేసాక, దాన్ని రద్దుచేయమని అడగడం రాజ్యాంగ హక్కా? అదీ ఇతర దేశాల్లోని చొరబాటుదారులు తమకు కావాలని డిమాండ్ చేయడం ఏ దేశ చరిత్రలో జరుగకపోవచ్చు. 

దేశ సరిహద్దులను గుర్తించేందుకు 1941 జనాభా లెక్కలు ప్రాతిపదిక అయ్యాయి. 1932 జనాభా లెక్కలు కమ్యూనల్‌గా చేస్తున్నారని కాంగ్రెస్ బహిష్కరించమంటే హిందువులంతా అమాయకంగా బహిష్కరించారు. ము స్లిం నాయకత్వం తమ వర్గాన్ని దగ్గరుండి నమోదు చే యించింది. 1941లో 15 శాతం వున్న షెడ్యూల్డ్ జాతులను లెక్కల్లో నియంత్రించేందుకు ముస్లిం లీగ్ కుట్ర పన్నింది. దీంతో బెంగాల్ జనాభాలో హిందువుల శాతం తగ్గిపోయింది. దాని ఫలితంగా దేశ విభజనలో ఎంతో భూభాగం మనం కోల్పోయేటట్లు చేసింది. ఇప్పటికైనా హిందువులు ‘చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష’ అంటూ చైతన్యం లేకుండా స్వార్థంగా జీవిస్తే మరో స్వాతంత్య్ర సంగ్రామం చెయ్యాల్సి వస్తుంది.. జాగ్రత్త!

*********************************
* శ్రీకౌస్తుభ*
*పెన్ గన్ గ : ఆంధ్రభూమి*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి